ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!

Three Men Were Caught kissing CCTV Camera At Chennai - Sakshi

ఇటీవల కాలంలో దొంగతనానికి వచ్చిన దొంగలు కొన్ని చిలిపి చేష్టలు చేస్తున్న ఘటనలు చూశాం. వాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థంకాక బిత్తరపోతున్నారు జనాలు. మొన్నటికి మొన్న ఒక దొంగ ఐ లవ్‌ యూ అని ఒక లెటర్‌ రాసిపెట్టి వెళ్లిపోయాడు. మరొక దొంగ ఇంత కష్టపడి దొంగతనం చేయడానికి వస్తే ఏం పట్టికెళ్లకుండా వెనుదిరగడం చాలా కష్టంగా ఉంటుందంటూ తన ఆవేదన చెబుతూ ఒక లెటర్‌ రాసి మరీ వెళ్లాడు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు దొంగలు సీసీటీవి వద్దకు డేర్‌గా వచ్చి ఏం చేశారో చూస్తే షాక్‌ అయిపోతారు.

ఏం జరిగిందంటే....తమిళనాడులో రామ్‌నగర్‌లోని ఒక అపార్టమెంట్‌ వాసులు దొంగల బెడదతో సీసీటీవీని ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో దొంగలు తరుచుగా ఇళ్లపై దాడులు చేయడం జరిగింది. ఐతే ఒక రోజు ముగ్గురు దొంగలు ఆ అపార్టమెంట్‌ కాపౌండ్‌ వాల్‌ ఎక్కి నడుచుకుంటూ వచ్చారు. పైగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ వద్దకు డేర్‌గా వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్లిపోయారు.

మరుసటి రోజు అపార్ట్‌మెంట్‌ వాసులు సీసీపుటేజ్‌ చెక్‌ చేయగా ముగ్గురు దొంగలు చేసిన చిలిపి నిర్వాకం చూసి షాక్‌కి గురవుతారు. ఈ మేరకు భయంతో తులసీ రమేశ్‌ అనే వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్‌ని ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ సదరు దొంగలను గుర్తించి సాయం చేయడండి అంటూ పోలీసులు ప్రజలను కోరాడు. ఐతే చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.

(చదవండి: హీరోయిన్‌ రేంజ్‌లో పరుగెత్తి... చివరికి నేలకి అతుక్కుపోయింది)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top