పంజాబ్‌లో టీకా తీసుకోకుంటే లీవ్‌పై వెళ్లాల్సిందే | Punjab govt employees to be sent on leave from September 15 if not vaccinated | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో టీకా తీసుకోకుంటే లీవ్‌పై వెళ్లాల్సిందే

Sep 12 2021 6:02 AM | Updated on Sep 12 2021 6:02 AM

Punjab govt employees to be sent on leave from September 15 if not vaccinated - Sakshi

చండీగఢ్‌: కోవిడ్‌ టీకా ఒక్క డోసు కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను సెలవుపై పంపించాలని పంజాబ్‌ ప్రభుత్వం కఠిన నిర్ణ యం తీసుకుంది. వైద్య సంబంధ, ఇత రత్రా కారణాలున్న వారికి మినహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. ఇప్పటి వరకు టీకా తీసుకోకుండా తప్పించుకుంటు న్న వారిని, కనీసం ఒక్క డోసైనా తీసుకునే వరకు లీవ్‌పై పంపిస్తామని తెలిపారు. రాష్ట్రం లో కోవిడ్‌ వ్యాప్తిని నివారిం చేందుకు అమల్లో ఉన్న ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. అన్ని రకాల సభలు, సమా వేశాల్లో ప్రస్తుతం ఉన్న పరిమితికి  సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement