లోక్‌సభ స్పీకర్‌ నివాసంలో విషాదం | Lok Sabha Speaker Om Birla Father Passed Away | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తండ్రి కన్నుమూత

Sep 30 2020 9:14 AM | Updated on Sep 30 2020 7:26 PM

Lok Sabha Speaker Om Birla Father Passed Away - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు. గత ‍కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌ నిబంధనల నడుమ స్వస్థలం రాజస్తాన్‌లోని కిషోరాపూర్‌ ముక్తిధామంలో బుధవారం శ్రీకృష్ణ బిర్లా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. (చదవండి: జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత)

కాగా పితృవియోగంతో విషాదంలో మునిగిపోయిన ఓం బిర్లా, ఆయన కుటుంబానికి సహచర ఎంపీలు, బీజేపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శీకృష్ణ బిర్లా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌, ఎంపీ సుప్రియా సూలే తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక ఓం బిర్లా రాజస్తాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement