దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి

Karnataka Minister Gave Expensive Diwali Gifts To Civic Body Members - Sakshi

బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌ తన నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆనంద్‌ సింగ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు గిఫ్ట్‌ బాక్సులను పంపారు. ఐతే మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్‌ బాక్స్‌లో రూ. లక్ష రూపాయలు నగదు, 144 గ్రాముల గోల్డ్‌, 1 కేజీ వెండి, సిల్క్‌ చీర, ధోతీ, డ్రై ఫ్రూట్‌ బాక్స్‌ ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ సభ్యులకు పంపిన గిఫ్ట్‌ బాక్స్‌లో తక్కువ మొత్తంలో నగదు, బంగారం తప్పించి అన్ని ఇతర వస్తువులు ఉండటం గమనార్హం.

(చదవండి: ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top