Karnataka: Bommai Got CM Post in Exchange For Money, Alleges Siddaramaiah - Sakshi
Sakshi News home page

siddaramaiah: డబ్బులిచ్చి సీఎం పదవి కొన్న బొమ్మై: సిద్ధు సంచలన ఆరోపణలు

May 9 2022 8:24 AM | Updated on May 9 2022 9:34 AM

Karnataka: Bommai Got CM Post in Exchange For Money Alleges Siddaramaiah - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎన్నికైన సీఎం కాదని, సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారనివిమర్శించారు. ఈ మేరకు బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బొమ్మై నియామకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారిందన్నారు.

‘డబ్బులిచ్చి ముఖ్యమంత్రి అయిన బొమ్మె ఎందుకు పనిచేస్తాడని, ఆయన్ను ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి వారి సూచనలను పాటించడం అతనికి సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగాలా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని, ఐదేళ్లపాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి 15 లక్షల ఇళ్లు కట్టించచినట్లు సిద్ధ రామయ్య తెలిపారు.
చదవండి: కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్‌?

కాగా రూ.2,500 కోట్లిస్తే సీఎం చేస్తామంటూ కొందరు తనను సంప్రదించారని బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ్‌ పాటిల్‌ ఇటీవలే ఆరోపించడం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement