Jammu & Kashmir: జమ్మూకాశ్మీర్‌లో విషాదం.. నలుగురు జవాన్లు సజీవదహనం

Indian Army Truck Catches Fire In Jammu Kashmir Poonch District - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. 

వివరాల ప్రకారం.. జమ్ము-పూంఛ్‌ రహదారిపై భారత ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top