దేశంలో 37 మెగా ఫుడ్‌ పార్కులకు గ్రీన్‌సిగ్నల్‌ | Final Approval Given To 37 Mega Food Parks: Ministry | Sakshi
Sakshi News home page

37 మెగా ఫుడ్‌ పార్కులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

Sep 15 2020 8:01 PM | Updated on Sep 15 2020 8:05 PM

Final Approval Given To 37 Mega Food Parks: Ministry - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 37 మెగా ఫుడ్‌ పార్కులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలో గోదావరి మెగా ఆక్వాపుడ్ పార్క్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో 50 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. చిత్తూరులోని శ్రీని పుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా, 16 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. 

తెలంగాణలోని నిజామాబాద్‌లో స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ఏర్పాటు వల్ల 25 మందికి ప్రత్యక్షంగా, 100 మందికి పరోక్షంగా ఉపాధి చేకూరనున్నట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించారు. పొలం నుంచి మార్కెట్ వరకు నిల్వతో పాటు.. ఆహార ప్రాసెసింగ్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం ఎమ్‌ఎఫ్‌పీఎస్‌(మెగా ఫుడ్ పార్క్) ప్రాథమిక లక్ష్యం. వ్యవసాయం, రవాణా, లాజిస్టిక్స్, కేంద్రీకృత ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల కల్పన ఇందులో ఉంటుంది. (ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత)

మెగా ఫుడ్ పార్కులను స్థాపించడం ద్వారా హబ్, స్పోక్స్ మోడల్ ఆధారంగా క్లస్టర్ ఆధారిత విధానంతో ఈ పథకం పనిచేస్తుంది. ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు (పీపీసీలు), కలెక్షన్ సెంటర్లు (సీసీలు).. సాధారణ సౌకర్యాల రూపంలో పొలం దగ్గర ప్రాధమిక ప్రాసెసింగ్‌, నిల్వ కోసం మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, విద్యుత్, నీరు ప్రసరించే చికిత్స ప్లాంట్ (ఇటిపి) వంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను ఈ పథకంలో కల్పిస్తారు.   (ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ)

ఈ పథకం సాధారణ ప్రాంతాలలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం (భూమి వ్యయాన్ని మినహాయించి), కష్టతరమైన కొండ ప్రాంతాలలో అంటే ఈశాన్య ప్రాంతంలో ప్రాజెక్టు వ్యయంలో 75 శాతం (భూమి వ్యయాన్ని మినహాయించి) చొప్పున మూలధన మంజూరు కోసం అందిస్తుంది. సిక్కిం, జమ్మూ కశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఐటీడీపీ రాష్ట్రాల నోటిఫైడ్ ప్రాంతాలతో సహా ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా రూ .50 కోట్లు కేటాయించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement