త్రివిధ దళాదిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ | Defence Minister Rajnath Singh Reviews Meeting Over Security Situation With Defence Navy And Army Chiefs | Sakshi
Sakshi News home page

త్రివిధ దళాదిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

May 13 2025 12:17 PM | Updated on May 13 2025 1:31 PM

Defence Minister Rajnath Singh reviews security situation

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకటన చేసిన వేళ..కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో కీలక సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో రాజ్‌నాథ్‌ సింగ్‌తో త్రివిధ దళాదిపతులు, డిఫెన్స్‌ సెక్రటరీ,సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ హాజరయ్యారు. ఈ కీలక భేటీలో కాల్పుల విరమణ, సరిహద్దుల్లో తాజా పరిస్థితుల గురించి చర్చ జరే అవకాశం ఉంది.    

మధ్యాహ్నం 3గంటలకు రక్షణ శాఖ ప్రెస్‌మీట్‌ నిర్వహించనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో ఆపరేషన్‌ సిందూర్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పాక్‌ ఎయిర్‌ బేస్‌ ధ్వంసంపై కీలక విషయాలు  వెల్లడించనుంది. పాకిస్తాన్‌ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రక్షణ శాఖ బ్రీఫింగ్‌ ఇవ్వనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement