సీఎం యోగిని ప్రశంసించిన ఫలితం... ఎస్పీ ఎమ్మెల్యేపై పార్టీ బహిష్కరణ వేటు  | Akhilesh Yadav Sacks Mla Who Praised Yogi Adityanath | Sakshi
Sakshi News home page

సీఎం యోగిని ప్రశంసించిన ఫలితం... ఎస్పీ ఎమ్మెల్యేపై పార్టీ బహిష్కరణ వేటు 

Aug 14 2025 3:31 PM | Updated on Aug 15 2025 5:23 AM

Akhilesh Yadav Sacks Mla Who Praised Yogi Adityanath

లక్నో: ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడుతున్నందునే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో 24 గంటల మారథాన్‌ చర్చ సందర్భంగా ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్‌ మాట్లాడుతూ తన భర్తను చంపిన అతిక్‌ అహ్మద్‌పై చర్యలు తీసుకున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. 

‘నా భర్తను ఎలా చంపారో, ఎవరు చంపారో అందరికీ తెలుసు. ఎవరూ విననప్పుడు నా మాట విన్న ముఖ్యమంత్రికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ప్రయాగ్‌రాజ్‌లో నాలాంటి చాలా మంది మహిళలకు ఆయన న్యాయం చేశారు. నేరస్థులను శిక్షించారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపు నమ్మకంగా చూస్తోంది’అని పూజాపాల్‌ వ్యాఖ్యానించారు. ‘నా భర్తను చంపిన అతిక్‌ అహ్మద్‌ను ముఖ్యమంత్రి మట్టిలో కలిపేసే పనిచేశారు. 

నేను ఈ పోరాటంలో అలసిపోతున్నప్పు డు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నాకు న్యాయం చేశారు’అని ఆమె ప్రశంసించారు. ఆమె వ్యాఖ్యలు సమాజ్‌వాదీ పార్టీలో తీవ్ర నిరసనలకు దారితీశాయి. చీఫ్‌ విప్‌ కమల్‌ అక్తర్‌ ఆమె ప్రకటనను వ్యక్తిగత విషయంగా అభివరి్ణంచారు. పార్టీని విభేదిస్తున్నప్పుడు అందులో ఉండకూడదనని వ్యాఖ్యానించారు. అయితే.. కొన్ని గంటల్లోనే పూజా పాల్‌పై పార్టీ కఠిన చర్య తీసుకుంది. 

ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ సంతకం చేసిన లేఖ బయటికి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం కారణాంగానే ఆమెను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ముందే హెచ్చరించినప్పటికీ, పూజా పాల్‌ తన కార్యకలాపాలను ఆపలేదని, దీనివల్ల పార్టీకి నష్టం కలిగిందని లేఖలో వెల్లడించారు. ఆమెను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నామని, ఇకపై ఎస్పీ కార్యక్రమాలు, సమావేశాలకు ఆహా్వనించబోమని కూడా స్పష్టం చేశారు.  

రాజు పాల్‌ హత్య...  
పూజా పాల్‌ భర్త, బహుజన సమాజ్‌ పార్టీ ఎమ్మెల్యే అయిన రాజు పాల్‌.. 2005 జనవరిలో తన వివాహమైన తొమ్మిది రోజులకే హత్యకు గురయ్యారు. అలహాబాద్‌ వెస్ట్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో అతిక్‌ అహ్మద్‌ సోద రుడు అష్రఫ్‌ అహ్మద్‌ను ఆయన ఓడించారు. అయితే.. తరువాత అహ్మద్, అష్రఫ్‌లను వేర్వేరు కేసులో దోషులుగా నిర్ధారించి జైల్లో పెట్టారు. 

2023 ఏప్రిల్‌ 15న రాత్రి, అతిక్‌ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను సాధారణ వైద్య పరీక్ష కోసమని ప్రయాగ్‌రాజ్‌లోని కోలి్వన్‌ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. రాత్రి 10:36 గంటల ప్రాంతంలో, పోలీసు ఎస్కార్ట్‌లో మీడియాతో మాట్లాడుతుండగా, జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు దుండగులు పాయింట్‌–బ్లాంక్‌ రేంజ్‌ నుండి కాల్పులు జరిపారు. ఇద్దరు సోదరులు అక్కడికక్కడే మరణించారు. దాడి చేసిన వారిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement