Rajasthan: 12 people feared dead after private bus caught fire after colliding with tanker - Sakshi
Sakshi News home page

బస్సు ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ : 12 మంది సజీవ దహనం

Nov 10 2021 12:22 PM | Updated on Nov 10 2021 1:28 PM

12 people feared dead after private bus caught fire after colliding with tanker Rajasthan - Sakshi

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ప్రయివేటు బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 12మంది సజీవ దహనమై పోయారు.

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయివేటు బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి.  దీంతో 12 మంది సజీవ దహనమై పోయారు. బార్మర్-జోధ్‌పూర్ హైవేపై బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది.  సమాచారం అందుకున్న  జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.

బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు పది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళనవ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్  జామ్ అయింది.  దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement