Viral: Railway Pointsman Mayur Shelke Donates Half Reward To Child He Saved - Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు గెలుస్తావ్‌ భయ్యా..! నెటిజన్లు ఫిదా

Apr 22 2021 1:49 PM | Updated on Apr 22 2021 3:56 PM

 A real hero Mayur Shelkhe decided to donate half of the money to child - Sakshi

మయూర్‌ షెల్కే  తన  ఔదార్యంతో మరోసారి రియల్‌ హీరో నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు.

సాక్షి, ముంబై:   ప్రాణాలకు  తెగించి మరీ పట్టాలపై పడి పోయిన  బాలుడిన కాపడిన రైల్వే పాయింట్‌మ్యాన్  మయూర్‌ షెల్కే  తన  ఔదార్యంతో మరోసారి రియల్‌ హీరోగా నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అతని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న తరువాత మయూర్‌  ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని  భావించారు.  ఆ బాలుడి చదువు, సంక్షేమం  నిమిత్తం  కొంత సొమ్మును దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతని పెద్దమనసుకు నెటిజనులు  హ్యాట్యాఫ్‌ అంటున్నారు.  మా మనసులను ఎన్నిసార్లు గెల్చుకుంటావ్‌ భయ్యా అంటూ  షెల్కేకు  ఫిదా అవుతున్నారు.  (సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్‌)

Advertisement
 
Advertisement
Advertisement