నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
● పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధం
● యూనిఫాం వస్త్రం సరఫరాలో జాప్యం
● మొదటి రోజు విద్యార్థులకు కొత్త దుస్తులు లేనట్టే..
కందనూలు: వేసవి సెలవులు ముగిశాయి. దాదాపు నెలన్నర రోజులపాటు ఇళ్ల వద్ద కాలక్షేపం చేసిన విద్యార్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపిన పిల్లలు పాఠశాలకు తిరిగి వెళ్లి చదువుకునే విధంగా తల్లిదండ్రులు మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులను ఉన్నత లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లాలనే ఉత్సాహం నెలకొంది.
ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇలా..
సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు
2021–22 81,129 40,179
2022–23 72,237 41,015
2023–24 63,291 47,406
2024–25 58,133 50,505
2025–26 54,666 47,504


