‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏ ఆశయాల కోసం సాగిందో.. ఆ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం అన్నివర్గాల ప్రజలు ఉద్యమాన్ని చేపట్టగా.. ఇప్పటివరకు ఈ దిశగా లక్ష్యాలను నెరవేర్చలేదు. సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉండగా, ఉద్యోగాల కల్పన పెరగలేదు. నాటి తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు. ప్రస్తుతం వారంతా ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా పట్టించుకోకపోవడం బాధాకరం.
– ఫయాజ్, తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీ కోకన్వీనర్, నాగర్కర్నూల్


