తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నవారికి గుర్తింపు దక్కలేదు. ఆనాడు అన్నీ వదిలేసి జెండా పట్టుకుని రోడ్ల మీదకు వస్తే మమ్మల్ని చూసి నవ్వుకునేవాళ్లు. కొల్లాపూర్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించాం. ఆనాటి ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తామని చెప్పినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికై నా ఉద్యమకారులను గుర్తించి సరైన విధంగా గౌరవించాలి.
– శేఖర్యాదవ్, తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుడు, కొల్లాపూర్


