జిల్లాకేంద్రంలో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుతో వాహనదారుల అవస్థలు తీరుతాయి. వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడపకుండా నెమ్మదిగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్తో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి.
– శివాచారి, నాగర్కర్నూల్
జిల్లాకేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేశాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా వాహనాలను నడపాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– నోముల వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ
●


