అచ్చంపేట రూరల్: ఆయిల్పాం సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయిల్పాం సాగుతో కలిగే లాభాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కృషి ధన్ ధన్య యోజన కింద అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రైతులు లాభసాటి పంటల సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్, సిద్దప్ప, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


