కోఆప్షన్ ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన వారు ఇందుకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల 24 సాయంత్రం 5 గంటలోగా మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు అందజేయాలి. నలుగురు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉండగా.. ఇద్దరు జనరల్, మరో ఇద్దరు మైనార్టీ వర్గానికి చెందినవారు ఉంటారు. దరఖాస్తుతోపాటు అర్హతలకు సంబంధించిన పత్రాలను జతపర్చాలి.
– నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్


