పవన్‌ కల్యాణ్‌ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్‌ నారంగ్‌ | Suniel Narang Response On Pawan Kalyan's Hari Hara Veera Mallu Issue | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్‌ నారంగ్‌

Jun 8 2025 8:22 AM | Updated on Jun 8 2025 10:36 AM

Suniel Narang Response On Pawan Kalyan's Hari Hara Veera Mallu Issue

‘‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలని కావాలని ఆపుతున్నారనడం తప్పు. ఆయన (పవన్‌ కల్యాణ్‌) సినిమాని ఎవరూ ఆపరు... ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్ట్స్‌ వీక్‌ నా సినిమా (‘కుబేర’ని ఉద్దేశించి) కూడా రిలీజ్‌కి ఉంది కదా? ఆయన సినిమా రిలీజ్‌ ఆపడం అనేది అసాధ్యం?’’ అని ‘తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ (టీఎస్‌ఎఫ్‌సీసీ) సమావేశంలో అధ్యక్షుడితో ΄ాటు కొత్త ΄ాలక మండలిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నిర్మాత సునీల్‌ నారంగ్‌ వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. ఉ΄ాధ్యక్షులుగా రవీంద్ర గో΄ాల, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్‌ వీఎల్, జాయింట్‌ సెక్రటరీగా 
చంద్రశేఖర్‌ రావు జె, ట్రెజరర్‌గా సత్యనారాయణ గౌడ్‌ .బి ఎన్నికయ్యారు. అదే విధంగా 15 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ– ‘‘అల్లు అరవింద్‌గారు, ‘దిల్‌’ రాజు, సురేష్‌బాబు, నా వద్ద థియేటర్లు ఉన్నాయనడం కరెక్ట్‌ కాదు. నా వద్ద 70 థియేటర్లు ఉంటే 40 బుకింగ్స్‌ ఉన్నాయి. 30 థియేటర్లు లీజ్‌ తీసుకున్నాం. అది కూడా గ్రౌండ్‌ లీజ్‌... ప్లస్‌ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అవన్నీ కలిపినా కేవలం ఐదారు శాతం మాత్రమే ఉన్నాయి. అనవసరంగా ఆ నలుగురు అంటూ మాట్లాడటం తగదు. 

ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అందరి సినిమాలూ రావాలి, విడుదలవ్వాలని కోరుకుంటాం. హీరోలు ఏడాదికి ఐదు సినిమాలు చేయాలి, పది చేయాలి అని మాట్లాడటానికి నేను ఎవరు? అది వాళ్ల ఇష్టం. వాళ్ల పారితోషికం నిర్ణయించడానికి మేము ఎవరు? హీరోలు అనేవాళ్లు దేవుళ్లు. 145 కోట్ల దేశ జనాభాలో ఇరవై ముప్పై  మందే హీరోలున్నారు. లేదంటే నలభై మంది ఉంటారు. అలాంటి వాళ్ల గురించి నేను ఏం మాట్లాడాలో తెలియడం లేదు. సినిమా రిలీజైన 28 రోజులకే ఓటీటీలో విడుదల చేయడం అన్నది కూడా ఓ శత్రువులా మారింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్‌... ఎవరూ బాగాలేరు. కానీ, డిజిటల్‌ ప్రొవైడర్స్‌ అయిన వీఎమ్‌ఎస్, క్యూబ్‌ వాళ్లు, ఓటీటీ వాళ్లు బాగున్నారు. నాతో సినిమా తీయమని నిర్మాతలను ఏ డైరెక్టరూ, హీరో పిలవరు. మాకు ఇష్టం అయితే మేం వెళుతున్నాం... మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు.

‘టీఎస్‌ఎఫ్‌సీసీ’ సెక్రటరీ శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ‘సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్‌ 2, కోర్ట్‌’ సినిమాల ద్వారానే ఎగ్జిబిటర్లకు డబ్బులు వచ్చాయి. మన హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని వినతి చేస్తున్నాను. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో టిక్కెట్‌ ధరలు, క్యాంటీన్‌ ధరలు సాధారణంగా ఉంటున్నాయి. కానీ, మల్టీప్లెక్స్‌లో ఎక్కువ ఉంటాయి. కావాలంటే రెండింటినీ పోల్చి చూడండి’’ అన్నారు. నిర్మాతలు సురేష్‌బాబు, కిరణ్, కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement