Rashmika Mandanna: ఆయన గొప్ప మనసున్న వ్యక్తి.. ఆ రోజులను గుర్తు చేసుకున్న రష్మిక

Rashmika Mandanna Shares Emotional Post About Puneeth Rajkumar Film - Sakshi

స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రంలో నటిస్తోంది. పుష్-పార్ట్‌ 1 సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ ఎదిగిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలూ చేస్తోంది. కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్‌ అందుకున్న రష్మిక మందన్నా దివంగత కన్నడ పవర్‌ స్టార్ పునీత్‌ రాజ్‌కమార్‌తో ఓ చిత్రంలో నటించారు. ఆయనతో కలిసి అంజనీపుత్ర అనే చిత్రంలో కనిపించారు. ఆ సినిమా విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు పుష్ప బ్యూటీ. 

ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. ట్వీట్‌లో రాస్తూ.. ' ఇప్పటికీ అంజనీపుత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను పునీత్ రాజ్‌కుమార్‌తో సంభాషణలను గుర్తు చేసుకుంటూనే ఉంటా. పునీత్  సార్ నాపై ఎక్కువ నమ్మకంతో ఉండేవారు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థానాన‍్ని నా హృదయంలో ఎప్పటికీ భర్తీ చేయలేరు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన హర్ష సార్‌కు థాంక్యూ.' అంటూ పోస్ట్ చేసింది. కన్నడ పవర్‌ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top