ఒకే వేదికపైకి రానున్న ప్రభాస్‌, అనుష్క | Prabhas And Anushka Reunite Again For Baahubali The Epic | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపైకి రానున్న ప్రభాస్‌, అనుష్క

Aug 20 2025 1:43 PM | Updated on Aug 20 2025 2:51 PM

Prabhas And Anushka Reunite Again For Baahubali The Epic

ప్రభాస్‌ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన  తొలి భాగం 'బాహుబలి: ది బిగినింగ్‌' విడుదలై ఇప్పటికే పదేళ్లు పూర్తి అయింది.  ఈ సందర్భంగా 'బాహుబలి: ది ఎపిక్‌' పేరుతో ఈ చిత్రాన్ని అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలిని  ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ చేయాలని ప్లాన్‌ చేస్తుంది.

'బాహుబలి: ది ఎపిక్‌'  విడుదల సందర్భంగా ఇప్పటికే ప్రభాస్‌, రానాలతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అనుష్క కూడా ఆ టీమ్‌లో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క్‌ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఆమె నటించిన 'ఘాటి' చిత్రం సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌తో పాటు 'బాహుబలి: ది ఎపిక్‌'ను కూడా పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఆమె ఉన్నట్లు సమాచారం. తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌లతో పలు ఈవెంట్లు నిర్వహించాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

తెలుగు సినిమా 'గ్లోబల్‌ రేంజ్‌'కి ఎదిగింది 'బాహుబలి'తోనే. ఒక రకంగా 'పాన్‌ ఇండియా' ట్రెండ్‌ ఆరంభమైనదే 'బాహుబలి'తోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌పై వరల్డ్‌ సినిమా దృష్టి పడింది.  ఇలా 'బాహుబలి' సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు చాలానే ఉన్నాయి. అవన్నీ త్వరలో చిత్ర యూనిట్‌ మనకు అందించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement