Pooja Hegde Is No Longer A Part Of Mahesh Babu Guntur Kaaram, Deets Inside - Sakshi
Sakshi News home page

Guntur Kaaram: అందుకే తప్పుకోవాల్సి వచ్చింది

Jun 22 2023 4:55 AM | Updated on Jun 22 2023 11:38 AM

Pooja Hegde is no longer a part of Mahesh Babu Guntur Kaaram - Sakshi

‘మహర్షి’ చిత్రం తర్వాత హీరో మహేశ్‌బాబు, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటించేందుకు రెడీ అయిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల మరో హీరోయిన్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా వివిధ కారణాల వల్ల ‘గుంటూరు కారం’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాల్షీట్స్‌ సర్దుబాటు చేయలేక హీరోయిన్‌ పూజా హెగ్డే ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘‘తమిళంలో ఓ చిత్రం, కన్నడంలో ఓ మూవీ, హిందీలో ఓ కొత్త ప్రాజెక్ట్‌తో పాటు కొన్ని యాడ్స్‌ కమిటయ్యారు పూజా హెగ్డే.

ఇలా వరుస కమిట్‌మెంట్స్‌ కారణంగా కాల్షీట్స్‌ సర్దుబాటు చేయలేక ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది’’ అని పూజా హెగ్డే వ్యక్తిగత సిబ్బంది పేర్కొన్నారు. ఇక ‘గుంటూరు కారం’ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో తొలుత సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్న శ్రీలీలను మెయిన్‌ హీరోయిన్‌గా ఫిక్స్‌ చేసిందట చిత్ర యూనిట్‌. అలాగే సెకండ్‌ హీరోయిన్‌పాత్ర కోసం సంయుక్తా మీనన్‌ వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తోందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. కాగా ‘గుంటూరు కారం’ నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెలాఖర్ లో ప్రారంభం అవుతుందని, వీలైనంత త్వరగా  షూటింగ్‌ను పూర్తి చేసి, ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమాను విడుదల చేసేలా చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement