అదే ట్రెండ్ ఫాలో అవుతోన్న నాగచైతన్య- శోభిత! | Naga Chaitanya and Sobhita Follows New Trend in Wedding | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: అదే ట్రెండ్ ఫాలో అవుతోన్న నాగచైతన్య- శోభిత!

Nov 25 2024 3:23 PM | Updated on Nov 25 2024 3:42 PM

Naga Chaitanya and Sobhita Follows New Trend in Wedding

మరి కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. డిసెంబర్‌ 4న వీరిద్దరి గ్రాండ్‌ వెడ్డింగ్‌ జరగనుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శోభిత- చైతూ ఒక్కటి కానున్నారు. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.

అయితే ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఓ ‍ట్రెండ్‌ నడుస్తోంది. తమ పెళ్లి వేడుక చిరకాల గుర్తుండిపోయేలా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే గ్రాండ్‌ వెడ్డింగ్‌ను ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. గతంలోనూ హన్సిక, నయనతార  సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. వీరిద్దరి బాటలోనే శోభిత- నాగచైతన్య నడుస్తున్నట్లు సమాచారం. తమ పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్‌ రైట్స్‌ సొంతం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మరికొన్ని ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది.  ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. అన్నపూర్ణ  స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వీరి పెళ్లి వేడుకను సిద్ధం చేశారు. తాతయ్య ఆశీస్సుల కోసమే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగచైతన్య వెల్లడించారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరాడని నాగార్జున తెలిపారు. అందుకే పెళ్లి పనులు కూడా వారిద్దరే చూసుకుంటున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement