
శ్రీనివాస్రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఫస్ట్ లుక్, ట్రైలర్ లతోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. అంగవైకల్యం కలిగిన ముగ్గురు యువకులు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు.. ఆ కేసు నుండీ ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. 'గరుడ వేగ' ఫేమ్ అంజి అందించిన విజువల్స్, సురేష్ బొబ్బిలి సంగీతం, చిన్న నేపేథ్య సంగీతం వంటివి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్లో మంచి ఆదరణ దక్కుతుంది.అలాగే మంచి వ్యూయర్ షిప్ కూడా నమోదవుతుండడం హర్షించదగ్గ విషయం. ఆల్రెడీ 'ముగ్గురు మొనగాళ్ళు' అమెజాన్ ప్రైమ్ నెంబర్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతుండడం విశేషం. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'చిత్రమందిర్ స్టూడియోస్' బ్యానర్ పై అచ్యుత్ రామారావు నిర్మించారు.