
‘ఆనందోబ్రహ్మ, యాత్ర’ సినిమాలతో ఆకట్టుకున్నారు దర్శకుడు మహీ వి. రాఘవ్. తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే నాగార్జునను కలసి కథాచర్చలు జరిపారట మహీ. త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా ఉండబోతోందని టాక్. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నారు నాగ్. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక మïß వి. రాఘవ్ దర్శకత్వంలో సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమా క్రైమ్ జానర్లో ఉంటుందని సమాచారం.