
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు.భారీ బడ్జెట్ మూవీగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చదవండి: 'భీమ్లా నాయక్' ఈవెంట్లో త్రివిక్రమ్ అందుకే మాట్లాడలేదా?
అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ్యాన్స కోసం మేకర్స్ ఓ సర్ప్రైజ్ను వదిలారు. ఈ రాతలే అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఫుల్ సాంగ్ను రేపు(శుక్రవారం)రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. చదవండి: నాకు ఇంకో బిడ్డ ఉంది: కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్