ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్చెరు టౌన్: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లను జమ చేసిందని ఆయన వెల్లడించారు. పటాన్చెరు అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 21 వేలమంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల రైతు భరోసా నిధులు జమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, అంజయ్యరాజు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు పాల్గొన్నారు.


