మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఎన్యూమరేషన్ ఫారం పొందిన ఓటర్లు దానిని ఎలా నింపాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. వారి సందేహాలను నివృత్తి చేయలేక బీఎల్ఓలూ గందరగోళానికి గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 25న ప్రారంభమైన ‘సర్’ కార్యక్రమం వచ్చేనెల 24 వరకు కొనసాగనుంది. బూత్ లెవల్ అధికారులు తమ పరిధిలోని ఓటర్లకు వారి ఫొటో, క్యూ ఆర్కోడ్తో ఉన్న ఫారాలు అందజేస్తున్నారు.
జిల్లాలో 4.53 లక్షల ఓటర్లు
జిల్లాలో 4 మున్సిపాలిటీలు, రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 4,53,522 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ‘సర్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 666 మంది పాల్గొంటున్నారు. ఇందులో 586 మంది బీఎల్ఓలు, 16 మంది ఏఈఆర్టీఓలు, 64 మంది బీఎల్ఓ సూపర్వైజర్లు పనిచేస్తున్నారు.
అవగాహన లేక ఓటర్ల అయోమయం


