ధాన్యం కొనాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనాలని ఆందోళన

Jun 7 2026 9:00 AM | Updated on Jun 7 2026 9:00 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌)/కొల్చారం: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని ఆగ్రహ ం వ్యక్తం చేస్తూ శనివారం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని తునికి గేట్‌ వద్ద 765డీ హైవేపై తునికి దేవులతండా రైతులు రాస్తారోకో చేశారు. లారీలు రాకపోవడంతో ధాన్యం పేరుకుపోయిందని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షాకాలం ప్రారంభం అవుతుంటే ధాన్యం సేకరణ ఎప్పుడు పూర్తి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అలాగే కొల్చారం మండలం చిన్నఘనాపూర్‌కు చెందిన రైతులు మెదక్‌–జోగిపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement