'ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహాన్ని' చూసి వస్తుండగా.. ఘోర ప్రమాదం! | - | Sakshi
Sakshi News home page

'ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహాన్ని' చూసి వస్తుండగా.. ఘోర ప్రమాదం!

Sep 24 2023 1:32 AM | Updated on Sep 24 2023 1:36 PM

- - Sakshi

వంశీ (ఫైల్‌)

మంచిర్యాల: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన యువకుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక కైలాసగిరి కాలనీకి చెందిన నలిమెల తిరుపతి, వినోద దంపతుల కుమారుడు వంశీ(23) హైదరాబాద్‌లోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితునితో కలిసి ద్విచక్రవాహణంపై ఖైరతాబాద్‌లోని గణేశ్‌ విగ్రహాన్ని చూసేందుకు వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందగా అతని స్నేహితునికి స్వల్పగాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement