27 కల్పవృక్షాలే ‘ప్రత్యేకత’..!
11వ శతాబ్దంలో ఈ స్థల మహిమకు ముగ్ధుడై కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. తెలుగు ప్రాంతాన్ని ఏకీకృతం చేయడానికి రాణి రుద్రమదేవి పాన్గల్, ఖిల్లాలపై యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండి వ్యూహరచన చేసినట్లు పూర్వీకులు చెబుతుంటారు. అయితే ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 27 కల్పవృక్షాాలే ఉండటం ప్రత్యేక విశిష్టత. ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం పక్కన ఉన్న కోనేరు చుట్టు 27 కల్పవృక్షాలు ఉన్నాయి. అందుకే కందూర్కు వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.


