
టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): యువతకు నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్ సహకారంతో టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ నిర్వహిస్తున్నట్లు టాస్క్ రిజినల్ సెంటర్ స్టేట్ హెడ్ నవీన్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రోగ్రామింగ్ స్కిల్స్, సీ లాంగ్వేజ్, జావా, హెచ్టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్..తదితర అంశాలపైన శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ తరగతులు డిప్లామా డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపయోగపడనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు 9908092738 నంబర్కు ఫోన్ చేయాలని, జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని టాస్క్ ఆఫీసులో సంప్రదించి తమపేర్లను నమోదు చేసకోవాలని సూచించారు.
నాణ్యమైన విద్యను అందించాలి
గండేడ్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ ప్రవీణ్కుమార్ సూచించారు. మంగళవారం మండలపరిధిలోని గాధిర్యాల ప్రాథమిక ఉన్నత పాఠశాల, కువ్హముది తండా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఎలా బోధిస్తున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి అలవాట్లను నేర్పించాలన్నారు.
యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఆమె ఎన్ఎస్ఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. యోగా దినోత్సవం రోజు నిర్వహించే అంతర్జాతీయ వెబినార్లో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ వలంటీర్లు భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యోగా ప్రాధాన్యత, ఆరోగ్యం తదితర వివరాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అర్జున్కుమార్, రవికుమార్, రాఘవేందర్, శివకుమార్, గాలెన్న, ఈశ్వర్, చిన్నదేవి తదితరులు పాల్గొన్నారు.
రేపు జూనియర్ ఫుట్బాల్ జట్టు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: నిజామాబాద్లో ఈనెల 28 నుంచి జూలై 1 వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను ఈనెల 19న ఉదయం 8 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలో వనపర్తి జిల్లా మినహా పూర్వ మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో రావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9396439663 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు.
16 అడుగులకుకోయిల్సాగర్ నీటి మట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ నీటి మట్టం మంగళవారం సాయంత్రం వరకు 16 అడుగులకు చేరింది. జూరాలకు ఇన్ఫ్లో కొనసాగడంతో ఉంద్యాల పంపుహౌస్ నుంచి నీటిని నిరంతరం ఒక పంపు ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి చేరడం ప్రారంభమైంది. యాసంగి పంటలకు వదిలిన తరువాత ప్రాజెక్టులో 11 అడుగుల మేర ఉన్న నీటి మట్టం 12 రోజుల్లో 5 అడుగుల మేర పెరిగింది. మరో 10.6 అడుగుల నీరు చేరితే పాత అలుగుస్థాయికి నీటి మట్టం చేరుతుంది. గేట్ల లెవల్ 32.6 అడుగులు కాగా మరో 16.6 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరుకుంటుంది.

టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ