
ప్రజలతో మానవీయంగా వ్యవహరించాలి
జడ్చర్ల: ప్రజలతో పోలీసులు మానవీయంగా వ్యవహరించాలని, ఫిర్యాదులు చేయడానికి వచ్చే బాధితులకు నమ్మకం కలిగే విధంగా పోలీసుల సేవలు ఉండాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు. మంగళవారం ఆమె జడ్చర్ల పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఠాణాకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సీరియస్గా తీసుకుని న్యాయ పరిరక్షణకు పాటు పడాలన్నారు. ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యమని తెలిపారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్టేషన్కు వచ్చే మహిళలను గౌరవించాలన్నారు. జాతీయ రహదారులు 44, 167లపై ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. రహదారులపై ఎక్కడా రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో గస్తీని ముమ్మరం చేయాలని దొంగతనాలు, ఇతర నేరాల అదపునకు కృషి చేయాలన్నారు. స్థానిక సమస్యల గురించి సీఐ కమలాకర్ను అడిగి తెలుసుకున్నారు.