నమూనాలు సేకరిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

నమూనాలు సేకరిస్తున్నాం

Jun 18 2025 3:23 AM | Updated on Jun 18 2025 3:23 AM

నమూనా

నమూనాలు సేకరిస్తున్నాం

వానాకాలంలో వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. రక్తకణాలు తగ్గాయని ఎవరూ ఆందోళన చెందరాదు. ఫీవర్‌ కేసులు అధికంగా వచ్చే ఏరియాలో వంద ఇళ్లను కవర్‌ చేసి పిచికారీ చేయిస్తున్నాం. ఎక్కువ కేసులు వస్తే అక్కడే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వేడి ఆహారం తీసుకోవడంతోపాటు పరిశుభ్రంగా ఉండాలి.

– డాక్టర్‌ కృష్ణ, డీఎంహెచ్‌ఓ

హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తాం..

స్పత్రిలో బాధితులు పెరిగితే ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఫీవర్‌ క్లినిక్‌ పేరుతో ప్రత్యేకంగా ఓపీ చూస్తున్నాం. వర్షాలు పడుతున్న క్రమంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి అధికంగా సోకుతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. జనరల్‌ ఆస్పత్రిలో కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.వాతావరణ మార్పులతో ఒక్కసారిగా రోగుల తాకిడి పెరిగింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు.

– సంపత్‌కుమార్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

నమూనాలు సేకరిస్తున్నాం 
1
1/1

నమూనాలు సేకరిస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement