
శ్రీశైలానికి స్థిరంగా వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలానికి వరద స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం తొమ్మిది రేడియల్ క్రస్ట్గేట్లను తెరచి 2,38,626 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం సమయానికి జలాశయంలో 197.0114 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 881.60 అడుగులకు చేరుకుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి 2,83,105 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 3,41,558 క్యూసెక్కుల నీటిని వదిలారు. నాగార్జునసాగర్కు స్పిల్వే ద్వారా 2,40,850 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 68,272 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్వాటర్ నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,430 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసరప్రాంతాలలో 15.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.