విద్యార్థులు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Apr 18 2025 12:42 AM | Updated on Apr 18 2025 12:42 AM

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

పెనమలూరు: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌, మాజీ ఇండియన్‌ టీం క్రికెటర్‌ ఎం.ఎస్‌.కె.ప్రసాద్‌ సూచించారు. కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ డీమ్డ్‌ టూబీ యూనివర్సిటీలో గురువారం తొలి వార్షిక క్రీడోత్సవంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. క్రీడల్లో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. తాను ఇండియన్‌ టీమ్‌లో ప్లేయర్‌గా, బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ పని చేసినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రదిభచాటిన యు.సాయిసుబ్రహ్మణ్యం, త్రినాథ్‌చౌదరి, ప్రణీత, ఎ.మణికంఠకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య, కార్యదర్శి పి.లక్ష్మణరావు, వైస్‌చాన్స్‌లర్‌ వెంకటేశ్వరరావు, ప్రో వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎ.వి.రత్నప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.రవిచంద్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పి.రఘు తదితరులు పాల్గొన్నారు.

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌

ఎంఎస్‌కే ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement