ఆసిఫాబాద్రూరల్: విద్యుత్ వినియోగదారుల స మస్యలు పరిష్కరిస్తామని వినియోగదారుల చైర్ ప ర్సన్ జయవంతరావు పేర్కొన్నారు. మండలంలోని బూర్గుడ సబ్స్టేషన్లో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన మండలా ల నుంచి వివిధ సమస్యలపై వినియోగదారులు దరఖాస్తులు అందజేశారు. సమస్యలు త్వరగా పరి ష్కరిస్తామని సంబంధిత అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, ఎస్ఈ ఉత్తమ్ జాడే, ఏవో దేవిదాస్, డీఈ వీరేశ్, నాగరాజ్ ఉన్నారు.


