
పక్కాగా పౌష్టికాహారం
● అమలులోకి ఫేషియల్ రికగ్నిషన్ ● సరుకులు పక్కదారి పట్టకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు ● వచ్చేనెల 1నుంచి అమలులోకి.. ● మొదటగా చిన్నారుల తల్లులకే..
కెరమెరి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తల్లుల ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేయాలని భావిస్తోంది. ఆరునెలలుగా మూడేళ్ల చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్ల పంపిణీకి మాత్రమే దీనిని వినియోగిస్తోంది. ఇందుకు ఫోన్ ట్రాకర్ యాప్లో తల్లుల ముఖ గుర్తింపు నమోదు చేస్తోంది. ప్రస్తుతం పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రక్రియ జూలై 1నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వచ్చే నెల నుంచి పకడ్బందీగా..
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బా లింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ నమోదు తప్పనిసరి చే సింది. సరుకులు పక్కదారి పట్టకుండా ఈ ప్రక్రియ అమలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలోని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏప్రిల్ నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. కొందరికి ఫోన్ ట్రాకర్ పనిచేయక పోగా.. దీన్ని వచ్చే నెల నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు. వచ్చే నెల నుంచి అంగన్వాడీ టీచర్లకు గతంలో అందజేసిన ఫోన్లో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ఫేషి యల్ రికగ్నిషన్ విధానం అమలు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా యాప్ను అప్డేట్ చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేపట్టనుండడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులుండవు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహా రం పంపిణీ ఏ మేరకు జరుగుతుందో దీని ద్వారా జిల్లా, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.
ఇప్పటివరకు చిన్నారులకే..
ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఆరు మాసాల వారి నుంచి మూడేళ్ల చిన్నారులకు పంపిణీ చేసే అదన పు ఆహారమైన బాలామృతం, గుడ్ల పంపిణీకి మా త్రమే ఇప్పటివరకు వర్తించేది. మూడేళ్లలోపు చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని రిజిస్ట్రేషన్ అయిన తల్లి లేదా తండ్రి ఫొటోను ఫోన్లో నమో దు చేసి పంపిణీ చేస్తారు. ప్రస్తుతానికి నమోదు ఇదొక్కటే అయినప్పటికీ రానురాను అన్ని సరుకులను ఫేషియల్ రికగ్నిషన్ ప్రక్రియ ద్వారా పంపిణీ చేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఈ విధానం ద్వారానే అందించనున్నారు.
అమలయ్యేలా చూస్తాం
ఫేషియల్ రికగ్నిషన్ విధానా న్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలయ్యేలా చూస్తాం. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ ప్ర క్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 1నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తెస్తాం. ప్రస్తుతం చిన్నారుల సరుకుల పంపిణీకి మాత్రమే ఉపయోగిస్తున్నాం. రిజిస్టేషన్ అయిన వారి ఫొటో మాత్రమే రికగ్నైజ్ అవుతుంది.
– రెబిక, ఐసీడీఎస్ సీడీపీవో, వాంకిడి

పక్కాగా పౌష్టికాహారం

పక్కాగా పౌష్టికాహారం