గం‘జాయ్‌’..! | - | Sakshi
Sakshi News home page

గం‘జాయ్‌’..!

Jun 22 2025 3:50 AM | Updated on Jun 22 2025 3:50 AM

గం‘జా

గం‘జాయ్‌’..!

● జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న అమ్మకాలు, వినియోగం ● యువకులు, విద్యార్థులే లక్ష్యంగా జోరుగా విక్రయాలు

కౌటాల: మత్తు పదార్థాల వ్యసనం పట్టణం నుంచి పల్లెకు పాకింది. జిల్లాలో గంజాయి వాడకం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంటర్‌, డిగ్రీ చదువుతు న్న వారితో పాటు పాఠశాలల విద్యార్థులు మత్తుకు బానిసవుతున్నారు. వీరి అలవాటును అవకాశంగా మలుచుకుని కొందరు గంజాయి రవాణా, అమ్మకాలతో వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలోని సరిహ ద్దు మండలాలైన కౌటాల, వాంకిడి, సిర్పూర్‌(టి), చింతలమానెపల్లి, బెజ్జూర్‌ మీదుగా మత్తు పదార్థాలను సరిహద్దు దాటించి స్థానికంగా విక్రయాలు జరుపుతున్నారు. అలాగే జిల్లాలోని కొందరు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారు. వానాకాలం సాగు సమయంలో పత్తి, ఇతర పంటల్లో ఈ మొక్కలు పెంచుతున్నారు. కౌటాలలో చా క్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్నారని, తమ పిల్లలు ఎక్కడ మత్తు బారిన పడతారోనని తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2022లో 22 కేసులు నమోదు కా గా, 8.5 కిలోల గంజాయి పట్టుకుని 203 మొక్కలు ధ్వంసం చేశారు. అలాగే 2023లో 32 కేసులు నమో దయ్యాయి. 2024లో 39కేసులు నమోదు చేశారు. గతేడాది జిల్లాలో 298.8 కిలోల గంజాయి, 121 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.

కట్టడి అయ్యేనా..?

‘జిల్లాలో మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం, ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటాం’ అని.. ఇటీవల కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే హెచ్చ రించారు. గంజాయి సాగును గుర్తించి సంక్షేమ పథకాలు నిలిపివేయాలని, పాఠశాలలు, వసతిగృహా లు, గురుకులాలు, కళాశాలల్లో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహ న కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 26న అంతర్జాతీయ డ్రగ్స్‌డే సందర్భంగా అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే గంజా యి విక్రేతలపై నిఘా అంతంతే ఉండటంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆడపాదడపా కేసులు మాత్రమే నమోదు చేస్తున్నా.. పూర్తిస్థాయిలో ఆరికట్టలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధా నంగా జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌, మండల కేంద్రాల్లో రాత్రివేళల్లో కొంతమంది యువత మత్తులో వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. కాగజ్‌నగర్‌ పట్టణంలోని సీబాపు కాలనీ పెద్దవాగు సమీపానికి గంజాయి సేవించడానికే యువత వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇది జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం

జిల్లాలో గంజాయి విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. తల్లిదండ్రులు పిల్ల లకు అవసరాలకు మించి డబ్బు ఇవ్వొదు. గంజాయి విక్రేతలపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకుంటున్నాం. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కల్పిస్తున్నాం. గంజాయి విక్రయాలపై సమాచారం ఉంటే డయల్‌ 100, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

– రామానుజం, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

ఇటీవలి

ఘటనలు

చాక్లెట్ల రూపంలో అమ్మకాలు..?

వాంకిడి మండలం అర్లీ గ్రామానికి చెందిన లెండుగురె రాజును మే 18న మండల కేంద్రంలో పోలీసులు తనిఖీ చేశారు. అతడి వద్ద నుంచి రూ.6,250 విలువైన మూడు ప్యాకెట్లలో 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

బెజ్జూర్‌ మండలం కుశ్నపల్లి సమీపంలో మే 24న గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సు లుగుపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్‌ సిడాం సంతోష్‌ బైక్‌పై తరలిస్తున్న రూ. 3,86,970 విలువైన 3.47 కిలో గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆసిఫాబాద్‌ మండలం దాంపూర్‌కు చెందిన అన్నాజీ ఇంట్లో ఈనెల 13న పోలీ సులు సోదా చేశారు. ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచి విక్రయిస్తున్న ట్లు గుర్తించారు. 295 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని విక్రయదారుల నిత్యావసర వ స్తువుల పేరుతో సరఫరా చేస్తున్నారని తె లుస్తోంది. ప్రత్యేక ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నారు. వేకువజామున వాహనాల్లో చాక్లెట్ల రూపంలో కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్‌, సిర్పూర్‌(టి) ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. చాక్లెట్ల రూపంలోని ఈ పదార్థానికి విద్యార్థులు సులువుగా ఆకర్షితులవుతున్నారు. తక్కు వ ధరలో లభించడం.. మత్తు ఎక్కువసేపు ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలు స్తోంది. ఇంకొన్ని చోట్ల సిగరెట్లలోని పొగాకు తొలగించి, దాని స్థానంలో గంజాయిని నింపుతున్నారు. 10 గ్రాముల గంజాయి ప్యాకె ట్‌ రూ.500 నుంచి రూ.600 వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. గంజాయి నింపిన ఒక్కో సిగరెట్‌ను రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వీటిని వినియోగిస్తున్న వారిలో ఎక్కువగా యువతే ఉండడం గమనార్హం. అందులోనూ 30 ఏళ్లలోపు వారే అధికం. వారు బానిసలుగా మా రి కుటుంబ సభ్యులపై గొడవలకు దిగుతున్నారు. మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అ వుతున్నారు. జిల్లాలోని యువత మత్తుకు బానిస కాకుండా కఠినచర్యలు తీసుకోవా లని జిల్లావాసులు కోరుతున్నారు.

గం‘జాయ్‌’..!1
1/1

గం‘జాయ్‌’..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement