
యోగా జీవితంలో భాగం కావాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో ని ర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా చేస్తే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. మ నస్సును ఏకం చేసి ఒత్తిడి, ఆందోళన తొలగిస్తుందని పేర్కొన్నారు. అనంతరం యోగాపై అందరి తో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఒత్తిడిని తగ్గించుకోవాలి
యోగాతో ఒత్తిడి తగ్గించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరై యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో మానసి క ఒత్తిడికి గురైతే యోగా ద్వారా తగ్గించుకోవచ్చ ని సూచించారు. ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ కోర్టులో..
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో మెజిస్ట్రేట్ అజయ్ ఉల్లం ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అ నంతరం సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశా రు. అలాగే యోగా గురువు అశోక్ ఆర్య ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పలువురు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో ర్యాలీ నిర్వహించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం యువకులకు యోగాపై ప్ర త్యేక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో యోగా ఆ యుష్ నోడల్ అధికారి డాక్టర్ నాగరాజు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఘనంగా యోగా దినోత్సవం
సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
కాగజ్నగర్ టౌన్: యోగాతో సంపూర్ణ ఆ రోగ్యం సిద్ధిస్తుందని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పేర్కొన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్లో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగా సమితి ఆ ధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. యోగాతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని, ఆరోగ్యవంతమైన జీవితానికి ఇది చక్కటి మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యో గా ప్రచారక్ దాసరి వినోద్గౌడ్, రవీందర్గౌడ్, వినోద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, యోగా శిక్షకుడు సత్యనారాయణ, ఆయూష్ మెడికల్ ఆఫీసర్ ఫిర్దోజ్, శిక్షకులు పాల్గొన్నారు.

యోగా జీవితంలో భాగం కావాలి

యోగా జీవితంలో భాగం కావాలి