ట్రిపుల్‌ఐటీకి 20,258 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీకి 20,258 దరఖాస్తులు

Jun 23 2025 6:16 AM | Updated on Jun 23 2025 6:16 AM

ట్రిపుల్‌ఐటీకి 20,258 దరఖాస్తులు

ట్రిపుల్‌ఐటీకి 20,258 దరఖాస్తులు

● జూలై 4న సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల ● 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన

భైంసా: 2025–26 విద్యాసంవత్సరానికి బాసర ట్రి పుల్‌ఐటీలో ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20,258 దరఖాస్తులు వచ్చాయి. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారి నుంచి ఈ నెల 21వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. 1,500 సీట్లుండగా ఒక్కో సీటుకు 14 మందికిపైగా పోటీపడుతున్నారు.

క్రమంగా తగ్గుతున్న పోటీ

ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి క్రమంగా విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య తగ్గుతోంది. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం 32వేల మంది, 2021 –22లో 20,178, 2022–23లో 31,432, 2023–24లో 32,635, 2024–25లో 15వేలు, 2025–26 విద్యాసంవత్సరంలో 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పరిశీలించి జూలై 4న సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేస్తామ ని ట్రిపుల్‌ఐటీ వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. జూలై 7నుంచి సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.

విద్యా విధానం ఇలా..

ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో భాగంగా తొలి రెండేళ్లు ఇంటర్‌ తత్సమాన పీయూసీ బోధిస్తారు. ఇందులో మెరిట్‌ ఆధారంగా నాలుగేళ్ల బీటెక్‌ కోర్సుకు వివిధ బ్రాంచ్‌లలో సీట్లు కేటాయిస్తారు. బీటెక్‌లో సివిల్‌, కెమికల్‌, కంప్యూటర్‌, ఎలక్టాన్రిక్స్‌, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు బోధిస్తారు.

క్యాంపస్‌లో వసతులు

ప్రవేశాలకు ఎంపికై న విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌ లు, యూనిఫాంలు, షూస్‌, స్పోర్ట్స్‌ డ్రెస్‌ ఇస్తారు. హాస్ట ల్‌, భోజన వసతి యూనివర్సిటీలోనే ఉంటుంది. ఆ టలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు తరగతులు నిర్వహిస్తారు. క్యాంపస్‌లోనే ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్‌, డిజిటల్‌ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement