
మున్సిపాలిటీ సమస్యలు తీరేనా..?
● జూన్ 2న ప్రారంభమైన ‘పట్టణ ప్రణాళిక’ ● 100 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు ● ఫొటోలకే పరిమితమవుతున్న అధికారులు ● ప్రశ్నార్థకంగా లక్ష్య సాధన
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, ప్రజాసమస్యల పరిష్కారానికి జూన్ 2న 100 రోజుల పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ము న్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో గల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు 50 రకాల అంశాలపై వివిధ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. కానీ మున్సిపల్ అధికారులు ఫొటోలకే పరిమితమవుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100 రోజుల్లో 50 అంశాలను విజయవంతం చేయడం ప్రశ్నార్థకంగా మారింది.
ప్రజలే ముందు..
జూన్ 2 నుంచి 100 రోజుల్లో 50 అంశాలను మున్సిపాలిటీల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘ప్రతీరోజు ఒక చర్య –ఒక మార్పు’ పేరిట ప్రజలను భాగస్వాములు చేస్తూ ‘ప్రజలే ముందు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. కానీ పట్టణంలో ప్రజలను భాగస్వాములు చేస్తూ పనులు సాగడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
100 రోజుల్లో చేపట్టాల్సిన పనులు..
● పరిశుభ్రత వ్యర్థాలను వేరు చేయడం వంటి అంశాలపై మైక్ద్వారా ప్రచారం చేయాలి. సోషల్ మీడియా ద్వారా, ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలి. కాలర్ ట్యూన్లు, పెయింటింగ్ల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాలి.
● పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు మా ర్కెట్ విక్రేతలు, దుకాణదారులు, పాఠశాలల సిబ్బంది నుంచి అభిప్రాయాలు సేకరించి అందరిని భాగస్వాములు చేయాలి.
● తడి, పొడి చెత్తలను ఇంటి వద్దనే వేరు చేసి కంపోస్టు తయారు చేయడం నేర్పించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి.
● వీధి కుక్కల సంతాన నియంత్రణ, ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర అంశాలను పరిగణించాల్సి ఉంటుంది.
● వనమహోత్సవం, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్ ప్రారంభం వంటి గ్రీనరీ ఏర్పాటు చేయాలి.
ప్రజల భాగస్వామం శూన్యం..
పట్టణ ప్రణాళికలో భాగంగా పట్టణంలోని ప్రజల ను చైతన్యం చేస్తూ కార్యక్రమంలో భాగస్వాముల ను చేస్తూ ముందుకెళ్లాలి. కానీ అధికారులు ప్రజల ను భాగస్వాములను చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు విన్పిస్తున్నాయి. మున్సిపల్ అధి కారులు, మహిళా మండలి సంఘాల సభ్యులతో ఆయా కాలనీల్లో నామమాత్రంగా కార్యక్రమాలను చేపట్టి మమ అనిపిస్తున్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పౌష్టికాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశా రు. ఎలాంటి ప్రకటన, ప్రజల భాగస్వామ్యం లే కుండానే మున్సిపల్ అధికారులు, కార్యాలయ సి బ్బంది, సమాఖ్య సంఘాల అధికారులు, సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని ముగించడం గమనార్హం.
ఎన్నో సమస్యలు..
పట్టణంలోని 30 వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడే రోడ్లపైనే చెత్తాచెదారం దర్శనమి స్తోంది. పట్టణంలోని ప్రధాన మార్కెట్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుళ్లిన కూరగాయలు, పండ్లు పడేస్తుండడంతో దుర్గంధం వ్యాపించి ప్రజలు ముక్కుమూసుకొని రోడ్డు వెంట వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కన్యకాపరమేశ్వరి దేవాలయం సమీపంలోని రోడ్డుపై వారం రోజులుగా చెత్తాచెదా రం తొలగించకపోవడంతో దోమలు, ఈగలతో వ్యాప్తి చెందుతున్నాయి. సీతాపతిరోడ్ సమీపంలోని ఖాళీ స్థలంలో చెత్తాచెదారం వేయడంతో డంపింగ్ యార్డులా తయారైంది. పట్టణంలోని కాపువాడ, సంజీవయ్య కా లనీ, ద్వారకానగర్, కౌసర్గనర్, బాలాజీనగర్ కాలనీల్లోని మురుగు కాలువల్లో పూడిక తీయక నీరు నిలిచి దోమలు విజృంభించి కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో ప్రతీరోజు తాగునీరు కలుషితమై వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రణాళికలు ఏమేరకు అమలు చేస్తారో వేచి చూడాలి.
ప్రణాళిక అమలు చేస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక పట్టణంలో అమలు చేస్తాం. పట్టణంలోని అన్ని కాలనీల్లో అధికారులు పనులు, సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నారు. పట్టణంలో తడి, పొడి చెత్తను వేరు చేసే విధంగా చూస్తున్నాం. ఆయా వార్డుల్లోని డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేయిస్తున్నాం.
– అంజయ్య, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్

మున్సిపాలిటీ సమస్యలు తీరేనా..?

మున్సిపాలిటీ సమస్యలు తీరేనా..?