
వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
బెజ్జూర్: మండలంలోని నాగులవాయి గ్రా మంలో ఆదివారం పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రెబ్బెన మండలానికి చెందిన ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకుడు దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో కార్యక్ర మం వైభవంగా జరిగింది. పోచమ్మ తల్లి ప్రతి ష్టాపనను శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం చండీ హోమం నిర్వహించి గ్రామ ప్రజల భద్రత, శాంతి, సమృద్ధి కోసం ప్రత్యేక పూజ లు జరిపారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాల ను తల్లికి సమర్పించారు. మాజీ ఉపసర్పంచ్ నికాడి బాపూరావు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.