
సంగీత కచేరీలో ఉత్తమ ప్రతిభ
ఆసిఫాబాద్ అర్బన్: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ, సిరి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివా రం రాత్రి నిర్వహించిన సంగీత కచేరీలో జిల్లాకు చెందిన వాసుదేవన సమక్ష నందన్కు అవార్డు దక్కింది. సంగీత కచేరీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సమక్ష నందన్ బాసర సరస్వతి అమ్మవారికి సంగీత, నృత్య నీరాజనం 2025 అనే అవార్డును ముఖ్య అతిథులు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్యయాదవ్, న్యూరాలజిస్ట్ యాక్టర్ దైవజ్ఞశర్మ, సింగర్ అనంత రామకృష్ణశర్మ, ప్రముఖ సింగర్ మంజుల చేతులమీదుగా అందుకున్నారు.