
ప్రతిపాదన పునఃపరిశీలించాలి
కాగజ్నగర్ టౌన్: జిల్లాకు టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని పీసీసీఎఫ్ ప్రొటెక్షన్, విజిలెన్స్ అండ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డన్ ఏలుసింగ్ మేరును ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబ కోరారు. శనివారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో ముధోల్ ఎమ్మె ల్యే రామారావు పటేల్తో కలిసి వినతిపత్రం అందజేశారు. కుమురభీం ఆసిఫాబాద్ జిల్లా కు టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ జీవో 49 కారణంగా ఆదివాసీలు, గిరిజనేతరులు ప్రజల్లో అనే క అనుమానాలు రేకెత్తాయని తెలిపారు. దీంతో జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. వెంటనే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు.