పిల్లలకు ధర్మ సందేశాలు నేర్పాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలకు ధర్మ సందేశాలు నేర్పాలి

Apr 22 2025 12:46 AM | Updated on Apr 22 2025 12:46 AM

పిల్లలకు ధర్మ సందేశాలు నేర్పాలి

పిల్లలకు ధర్మ సందేశాలు నేర్పాలి

రాయచూరు రూరల్‌: హిందూ వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధించడం మనందరి కర్తవ్వమని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం రామలింగేశ్వర ఆలయంలో జిల్లా బేడ జంగమ ఏర్పాటు చేసిన వేద అధ్యయన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి మంత్రోపచారణ, ఇష్ట లింగపూజ, ఆచమ, అగమ, ఇతర పఠాణాలను శిబిరంలో నేర్పిన విద్య చిరకాలం గుర్తుంటుందని ప్రస్తావించారు. శిబిరంలో వీర సంగమేశ్వర స్వామి, శరణ భూపాల్‌ నాడగౌడ, చంద్ర శేఖర్‌ పాటిల్‌, అశోక్‌, సూగప్ప, శరణయ్యలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement