ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 11 దాటితే బయటికి వెళ్లాలంటే భయమేస్తోంది. నెత్తిపై నిప్పుల కుంపటి కురుస్తోంది. శుక్రవారం 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రలు నమోదైన క్రమంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం మేడే సందర్భంగా కార్మికులకు విశ్రాంతి దొరకగా.. చిరువ్యాపారులు ఎండకు తల్ల డిల్లిపోయారు. ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరగా వేడిమిని తట్టుకునేందుకు ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయాలు అనుసరిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


