● బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణలో బహుజన రాజ్యం సాధిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన బహుజన నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నం రఘు సంస్మరణ సభ స్వగ్రామంలో ఆదివారం ఏర్పాటు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ మాట్లాడుతూ కన్నం రఘు ఆశయాలు నెరవేర్చాలంటే బహుజన సమాజం ఒక్కతాటిపై నిలవాలన్నారు.


