బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్‌, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్‌ తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్‌ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్‌ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు.

దాడి చేసిన వ్యక్తి రిమాండ్‌

చందుర్తి(వేములవాడ): పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని దాడిచేసిన చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్‌ తెలిపారు. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాలు. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన గొంటి లక్ష్మణ్‌ రోడ్డుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నామాల ఉరఫ్‌ మ్యాదరి నర్సయ్య ఈనెల 5న గొడ్డలి కామతో దాడి చేశాడు. బాధితుడు లక్ష్మణ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement