
నృసింహుడి హుండీ ఆదాయం రూ.71.53 లక్షలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.71,53,190 సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. మార్చి 21 నుంచి ఈనెల 26 వరకు (98 రోజులు) వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా నగదుతోపాటు 68 గ్రాములు మిశ్రమ బంగారం, 7.400 కిలోల మిశ్రమ వెండి, 32 విదేశీనోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రజ, ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, స్వచ్ఛంద సేవకులు, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, అర్చకులు తదితరులున్నారు.
ఆల్ ఇండియా సెమ్స్ ఒలింపియాడ్లో ప్రతిభ
సప్తగిరికాలనీ(కరీంనగర్): సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ నేషనల్ సెమ్స్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభకనబర్చి ఆల్ ఇండియా, స్టేట్ లెవల్ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. ఎన్.రక్షిత ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, కె.మహిత ఆల్ ఇండియా 4, స్టేట్ లెవల్లో పి.మహిధర్, ఆత్రేయులు 2, మహిత 3, మహి చౌదరి 7 పరీక్షిత్ సారధి, అభిగ్నలు 10వ ర్యాంకులతో పాటు పలువురు విద్యార్థులు జోనల్ ర్యాంకులు సాధించారని తెలిపారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, కో ఆర్డినేటర్లు, ఇన్చార్జి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నృసింహుడి హుండీ ఆదాయం రూ.71.53 లక్షలు