
మత్తు పదార్థాలకు బానిస కావద్దు
● కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి/కరీంనగర్ క్రైం: యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి వైద్య కళాశాల ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. వైద్య, ఇంజినీరింగ్ విద్యార్థులు కొందరు మత్తు పదార్థాల బారిన పడుతుండటం బాధాకరమన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిరోధానికి డ్రగ్ డిటెక్షన్ కిట్లను ఉపయోగించి తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కళాశాలస్థాయిలో విద్యార్థులు ఎక్కువగా మత్తు పదార్థాల బారిన పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ పాఠశాలస్థాయిలో విద్యార్థులు మత్తుకు బానిసకావడం దారుణమన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
పోలీసుల ఆధ్వర్యంలో
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీ గౌస్ఆలం ఆధ్యరంలో గురువారం నగరంలో రెండు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. అనంతరం కమిషనరేట్ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.